Article Search

కార్తీక పురాణము - పన్నెండవ రోజు పారాయణం

 

అత్రిమహముని చెబుతున్నాడు:- అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని 'హరిబోధిని' అని అంటారు. ఆ ఒక్క పర్వతిథీ వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్లా, ఏకాదశిపట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది.

Showing 1 to 1 of 1 (1 Pages)